
రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. ఇది వారి కోసమే. ఆర్ ఆర్ బి సికింద్రా బాద్ పరిధిలో మొత్తం 5 పోస్టుల్లో 30,307 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సికింద్రబాద్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీల్లో ఈ కింద ప్రకటించిన పోస్టులను భర్తీ చేయనుంది
- చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 6235 పోస్టులు
- స్టేషన్ మాస్టర్ 5623 పోస్టులు
- గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3562
- జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 7520 పోస్టులు
- సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 7367 పోస్టులు
అర్హతలు:
అధికారిక నోటిఫికేషన్ చూడటం ద్వారా తెలుసుకోవాలి.
వయోపరిమితి:
ప్రతి పోస్టుకు అభ్యర్థుల వయసు 18-32 ఏళ్ల మధ్యలోనే ఉండాలి.
వేతనం:
చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్- రూ.35,400, స్టేషన్ మాస్టర్- రూ.35,400, గూడ్స్ ట్రైన్ మేనేజర్- రూ.29,200, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్- రూ.29,200, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్- రూ.29,200
దరఖాస్తులు:
అభ్యర్థులు తమ దరఖాస్తులను కేవలం ఆన్లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. అధికారక వెబ్సైట్ను సందర్శించి, అప్లికేషన్ ఫార్మ్ను పూర్తి చేసి, తగిన ఫీజును చెల్లించాలి. అదేవిధంగా, కావాల్సిన పత్రాలను సైతం అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
30 ఆగస్ట్, 2025న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై, 29 సెప్టెంబర్, 2025న ముగుస్తుంది. ఈ సమయంలోనే దరఖాస్తులు చేసుకోవడం, ఫీజు చెల్లించడం పూర్తి చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలను అధికారిక వెబ్సైట్లో ప్రకటించే నోటిఫికేషన్ను పరిశీలించగలరు.